Wednesday, August 6, 2014

సకల విఘ్నాలను హరించే మన విశాఖ వినాయగర్‌

                            సంపదలొసగే సంపత్‌ వినాయకుడు
సిద్ధిబుద్ధి వినాయకుడు, ఏకదంతుడు, లక్ష్మీగణపతిగా అందరికీ తెలిసిన వినాయకుడు సంపదలు కూడా ఇస్తానని చెప్పేందుకు వెలసిన అవతారమే సంపత్‌ వినాయగర్‌.(ఆంధ్రప్రదేశ్) లో విశాఖపట్నం జనమేగాక అనునిత్యం చుట్టుపక్కల ప్రాంతాలనుంచి అశేషంగా భక్తజనం వచ్చి స్వామివారిని కొలుచుకుంటుంటారు. అభిషేక ప్రియుడైన ఆ గజాననుడికి కోరికలు తెలియజేసు కుంటుంటారు. భక్తుల కొంగుబంగారంగా స్వామి ఇక్కడ విరాజిల్లుతున్నారు.

విశాఖ నగర నడిబొడ్డున వెలసిన శ్రీసంపత్‌ వినాయగర్‌ స్వామి భక్తుల నుండి అశేష పూజులందు కుంటున్నారు. ధూప దీప నైవేద్యాలతో, నిత్యపూజల తో ఆలయం కళకళలాడుతోంది. అభిషేక, అలంకారాలకు శ్రీసంపత్‌ వినా యగర్‌ స్వామి దేవాలయం ఏకైక ప్రత్యేకత. నగరంలో గణనాధుని ఆలయల్లో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం శ్రీసంపత్‌ వినాయగర్‌ దేవాలయం. భక్తుల పాప ప్రక్షాళనతో పాటు కొర్కేలు తీర్చే ప్రభువుగా గణనాధుడు ప్రసిద్ధికెక్కారు.
గరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ (ఆశీలుమెట్ట) సమీపంలో... 1962లో ‘మెసర్స్‌ ఎస్‌జి సంబంధన్‌ అండ్‌ కో’ ఆవరణంలో స్వర్గీయ ఎస్‌జి సంబంధన్‌, టిఎస్‌ సెల్వగణేశన్‌ టి.ఎస్‌ రాజేశ్వరన్‌ కుటుంబ సభ్యులు శ్రీ సంప త్‌ వినాయగర్‌ స్వామివారి దేవాలయాన్ని స్థాపించారు.తమ వ్యాపార కార్యాలయం ఎదుట వాస్తుదోష నివారణార్థం నిర్మించారు. తదనంతరకాలంలో మత్స్యకారులద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమేణా వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలను కథలు... కథలుగా చెప్పుకునేవారు. దేవాలయం స్థాపించిన కొత్తలో సమీప జాలర్లు ప్రతిరోజు స్వామిని అర్చించి, నమస్కరించి వారి వృత్తిని మొదలుపెట్టేవా రు. ఐదు సంవత్సరాలు తరు వాత కంచి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వహస్తాలతో ‘గణపతి యంత్రం’ స్థాపించారు. 1971లో ఇండియా, పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో విశాఖను రక్షించమని శ్రీసంపత్‌ వినాయగర్‌ స్వామిని వేడుకున్నట్టు చరిత్ర చెబుతోంది. 
సకల విఘ్నాలను హరించి తనను కొలిచేవారికి సంపదలిచ్చే వేల్పుగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు సంపత్‌ వినాయగర్‌. విశాఖపట్టణం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈస్వామి ఆలయం దేశంలోనే ఇతర వినాయక ఆలయాల కన్నా చాలా చిన్నది... ప్రతిరోజూ దాదాపు అయిదువేలమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు.ఇలా సంపత్‌ వినాయగర్‌కు ప్రాచుర్యం లభించింది. 1971లో ఇండో...పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో పాక్‌ యుద్ధనౌకలు భారత సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చినప్పుడు విశాఖను కాపాడాల్సిందిగా ప్రార్ధిస్తూ తూర్పునావికాదళం ఇన్‌చార్జి అడ్మిరల్‌ కృష్ణన్‌ సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో 1,101 కొబ్బరికాయలను స్వామివిగ్రహం ముందు కొట్టారు. ఇది జరిగిన కొద్దిరోజులకే పాకిస్తాన్‌ సబ్‌మెరైన్‌ పిఎన్‌ఎస్‌ ఘాజీ సముద్రజలాల్లో మన యుద్ధనౌకలపై దాడిచేసేందుకు వచ్చి బాంబులు అమర్చి తిరిగివెళ్తూ అవే బాంబులు పేలి సముద్రంలో మునిగిపోయింది. దీంతో విశాఖనగరానికి పెద్దప్రమాదం తప్పింది. ఇదంతా వినాయగర్‌ మహిమేనని భావించిన అడ్మిరల్‌ కృష్ణన్‌ తాను ఇక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజూ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో దర్శనానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరంలేదు. 
ప్రముఖులు సైతం సాధారణ భక్తులతోపాటు వచ్చి స్వామిని దర్శించుకోవలసిందే... అభిషేకాలు, ప్రత్యేకపూజలకు మాత్రం రుసుము వసూలుచేస్తారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినవారు ముందుగా తమ వాహనాలను సంపత్‌ వినాయగర్‌ ఆలయానికి తీసుకువచ్చి పూజలుచేయించిన తర్వాతనే వాటిని వినియో గించడం ఆనవాయితీగా మారింది. ఉగాది, వినాయకచతుర్థి, పుత్రగణపయ్య వ్రతం, సంకటహర చతుర్థి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో ఎంతో విశేషంగా మహోత్సవాలు జరుగుతాయి. సంపత్‌ వినాయగర్‌ను దర్శించుకునేందుకు ద్వారకా బస్‌స్టేషన్‌లో( విశాఖపట్టణం ఆర్ టి సి కాంప్లెంక్స్ )లో దిగి కాలినడకన చేరుకోవచ్చు.

Thursday, July 10, 2014

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడ విశేషం.త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలో అన్నవరం ఉంది .అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. 
శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.
మూలతో బ్రహ్మరూపాయ 
మధ్యతశ్చ మహేశ్వరం 
అధతో విష్ణురూపాయ 
త్ర్త్యెక్య రూపాయతేనమః

స్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.
దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.
ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది.
పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్యదేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తుంటారు.వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.


Wednesday, July 9, 2014

అమర్నాద్ యాత్ర విశేషాలు

అమర్‌నాథ్‌ యాత్రని చేసి వచ్చి నట్లైతే మృత్యువుని చాలా దగ్గరలో చూసి వచ్చినట్లే...!!!

అమర్నాద్ యాత్ర విశేషాలు

మర్నాద్  "అమరనాధుడంటే"  జరామరణములు లేని వాడు అని అర్ధం .  హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం మరియు అత్యంత ప్రమాదకరమైన యాత్ర కూడా . చుట్టూ మంచు ఎత్తైన కొండలు , ఎటుచూసినా మంచుతో కప్పబడి ఉన్న కొండలు , మంచు కరగడం చేత కొండలు స్నానం ఆడుతున్నాయా అనే భావం కలిగించేలా ఉండే సౌందర్య దృశ్యంమే ఈ ప్రదేశం .కొండలపైనుంచి కరిగి వస్తున్న మంచును తన వడిలోకి చేర్చుకుని వయ్యారంగా వంపులు తిరుగుతూ ప్రవహించే సింధు నది . ఆ నదిలోంచి వచ్చే శబ్దాలు పై నుంచి మనకు కనిపిస్తున్నా మానసికంగా మాత్రం ఆ సింధు నదిలోనే ఆడుతూ పాడుతున్నట్టుగా ఉంటాదంటూన్నారు యాత్రికులు .. ఎప్పటి నుంచి ఉన్నాయో పెద్దపెద్ద చెట్లు కనిపిస్తుంటాయి.. ఇక్కడ శివయ్య లేకపోతే నేను ఇంత సాహసం చేసి వచ్చేవాడినా ...భక్తులుకు ఇంత ప్రకృతి అందాలను చూడగలిగే వాన్నా అని పించక మానదు . 
స్థల పురాణం

అమరనాధుడంటే జననమరణాలు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ! నీవు జన్మించినప్పు డంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను అని బదులిచ్చాడు. పార్వతీ దేవి నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నావు ఇది ఎలా సాధ్యం అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతికి చివరకు ఈశ్వరుడు అమరనాధ్‌ గుహను ఎంచుకున్నాడు. పహల్‌ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్‌ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్లాడు. షిషాంగ్‌ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు. మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు. తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్‌ గుహలోపలికి వెళ్లాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వ రహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు.
వంటిలో ఓపిక   ఉండగానే యాత్రలు చెయ్యాలి అనే మాట .. వయసు పైబడిన తరువాత అమర్నాద్ వచ్చే భక్తులకు గుర్తోచ్చి తీరుతుంది . వంటిలో ఓపికున్నప్పుడు అమరనాధుడు గుర్తుకు రావాలి .. ఆయన అనుగ్రహం కూడా ఉండాలిగా !
పర్వతాల పై మంచుపడి ఆ మంచుపై సూర్యకిరణాలు పడటం చేత వచ్చే తెల్లటి కాంతి లోనే శివయ్య దర్శనం ఇస్తూ ఉంటాడు .
ఈ యాత్ర సాహస యాత్ర ని చెప్పడానికి కారణం . సరైన రవాణ సౌకర్యం లేకపోవడం . నిజానికి ఈ అమర్నాద్ యాత్ర జూలై లో ప్రారంభమై - ఆగష్టు లో ముగుస్తుంది . 45 రోజులు మాత్రమే అమర్నాద్ యాత్ర ఉంటుంది . ఆ తరువాత ఈ ప్రాంతం మంచుతూ కప్పబడిపోతుంది . తిరిగి జూలై లోనే ప్రారంభం అవుతుంది . ఈ ప్రాంతం లో ఎవరూ నివసించరు . ప్రయాణం అంతా ఇరుకు రోడ్లపై నే సాగుతుంది . 
ఏ మాత్రం కాస్త అజాగ్రత్త ఉన్న అంతే సంగతులు .. ఇక్కడ గుర్రాలు తప్ప మరే ఇతర వాహనాలు ఉండవు .కొందరు భక్తులు హెలికాప్టర్ పై వచ్చినా సరే 6 కిలోమీటర్లు ముందే హెలికాప్టర్ ఆపివేస్తారు . అక్కడ నుంచి గుర్రాలకు వేరేగా డబ్బులు ఇచ్చి ప్రయాణం కొనసాగించాలి .
గుర్రాలపై ప్రయాణం అంత సులువు కాదు . మనం ఎక్కినా 5 - 10 నిమిషాల్లోనే  ఒళ్ళంతా కదిలిపోవడం చేత ఇంకా ఎంత దూరం అని అడగకుండా ఉండలేము . చుట్టూ కొండలు ఎత్తైన ప్రదేశం లో మనకు .. ఎంత లోతుందో తెలియని లోయలు .. వేగంగా ప్రవహిస్తూన్న సింధు నది . గుర్రం అటు ఇటు కదలడం కాస్త అటు పక్కకి ఇటు ప్రక్కకి కదులుతూంటే .. శివ శివా అని మనకు తెలియకుండానే శివనామస్మరణ చేస్తాం .  
అమర్నాద్ గుహ శ్రీనగర్ ( జమ్మూ మరియు కాశ్మీర్  ) కు 141 కిలోమీటర్ల దూరంలో 3,888 m (12,756 ft) ఎత్తులో ఉంది .
 జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి , పహల్ గాం నుంచి గుహ కు చేరే లోపు మనం 
 కూడా చూస్తూ వెళ్తాం . 
జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కొరకు రఘునాధన్ వీధిలో ఉన్న " టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ , జమ్ము & కాశ్మీర్ ' వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెలవారకముందే   వెళ్ళాలి.
*  శ్రీ నగరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యమవుతాయి. పహల్ గాం కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి.
* చంద్రవారి ఇది పహల్ గాం  నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మినీ బస్సులు లభ్యమవుతాయి. లిడ్డర్ నథీ తీరం వెంట ఈ బస్సు మార్గసం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.
* శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాధ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్  సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లైతే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్పురిస్తుంది.
* శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న "పాంచ్ తర్ణి " చేరుకుంటారు. 
సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పని సరి. ఇక్కడ కొందరు యాత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతు వచ్చే అనుభూతికి లోనవుతారు. ఎండు ఫలాలు, వగరు తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్ళు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు.
పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి .సంగమప్రాంతాన్ని చూడ వచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతమంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశివుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు.
* యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా "బాల్ తల్" చేరుకుని అక్కడ నుండి అమరనాధ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పల్లకీలు) లభిస్తాయి.. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక "బాలా తల్ " అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రయాణం సాగుతున్నంతా సేపు .. కొండల్లోంచి వచ్చే చల్లటి గాలి .. ఉన్నట్టు ఉండి మన గుర్రం పడిపోతుందేమో అనే భయం .. కొండల అంచుల్లో ప్రయాణం .. చుట్టూ చూస్తే అబ్బ ఎంత బాగుంది .. ఆహ చాలు ఈ జన్మకి నేను చూడగలిగాను చూస్తున్నాను అనే ఆనందం కలుగుతుంది, .. 
* వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
* జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
* రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.

ఉపయుక్తమైన విషయాలు 

* చందన్ వాలి, శేషాంగ్,  పాంచ్ తర్ణి లలో హ్రభుత్వం చేత నడుపబడుతున్న డిపారాట్ మెంటల్ స్టోర్స్ లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం ఔతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం ఔతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్ కట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* యాత్రీకులు "శ్రీ ఆమర్నాథ్ జి ష్రైన్ భోర్ద్ ఫర్ ది యాత్ర " వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్ష రూపాయలు నగదు లభిస్తుంది. 
* యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దేకు లభిస్తాయి.
* యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లైతే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు అవుతుంది.
యాత్రీకులు చేయవలసినవి 

* యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి  14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి.
* యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
* ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి.
* స్త్రీలకు చీరలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి.
* పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు.
* పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి.
* యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. 
* యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమైన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి.
* మీ గురించి సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవాలి. అవసరమైన సమయాలలో అది ఉపయోగపడుతుంది. 
* మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణంగా కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి.
* ప్రయాణం చేసే సమయంలో వేగించి ఉన్న పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి.
* కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.
* కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి.
* నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. 
* మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి.
* నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. 
* నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి.
* మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి.
 అమర్‌నాథ్‌ యాత్రని చేసి వచ్చినట్లైతే మృత్యువుని కాస్త దగ్గర నుంచి చూసి వచ్చినట్లే . శివుని పై భారం వేసి ఓం నమః శివాయ అంటూ వెళ్తున్నవార్కి యమపాసలు ఏమి చేయగలవు ? 
యాత్రీకులు చేయకూడనివి 
* హెచ్చరిక ఫలకం మరియు హెచ్చరిక చిహ్నం ఉన్న ప్రదేశాలలో నిలబడకండి.
* సిగరెట్లు, మధుపానం చేయకండి. 
* నిటారుగా ఉండే కొండ చరియలలో నడవడానికి స్లిప్పర్స్ ఉపయోగించడం ప్రమాదకరం కనుక లేసులు కలిగిన షూలను వాడండి.
* పరిసరాలను కలుషితం చేసే సామానులు వాడకండి. 
* అమరనాథుని తాకకండి, ఆయన మీద పూజాద్రవ్యాలను విసరకండి, సాంబ్రాణి కడ్డీలను వెలిగించకండి.
* కూలీలకు, పోనీలకు, దండీలకు, వంటసామానులకు, కట్టెలకు, వసతిగృహాలకు నిర్ణయించిన దానికంటే అధికం చెల్లించకండి. 
* నిర్ణయించిన రుసుము కంటే అధికమైన ధనం హెలికాఫ్టర్లకు చెల్లించకండి. 
* రాత్రి వేళలో గుహాలయంలో ఉండకండి. అలా చేస్తే అక్సిజన్ కొరత వలన ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.

వేరోక కథనం

పురాతన ఇతిహాసాలలో మరొక కధ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరసును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహింపజేశాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్‌ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్‌ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్‌ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్లి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణ కాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది.

Thursday, June 26, 2014

Kota diu

రాజ్ గడ్ ట్రెక్కింగ్ లో ....నా అనుభవం...!!!


                     రాజ్ గడ్ ట్రెక్కింగ్లో....నా అనుభవం...!!!

  రాజ్ గఢ్ మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఒక అందమైన పర్వత కోట. చత్రపతి శివాజీ మహారాజ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన మరాఠా సామ్రాజ్యంలో రాజుగా పట్టాభిషేకం సమయంలో 1674 లో తన రాజధాని ఫోర్ట్ రాగ్ గడ్ ను ప్రకటించుకున్నారు.రాజ్ గఢ్ మహారాష్ట్ర రాష్ట్రం పశ్చిమ దక్షిణ భాగంలలో ఉంది
. భారతదేశం పశ్చిమ తీరంలో మరియు అరేబియా సముద్రం ఒడ్డున రాజ్ గడ్ సహ్యాద్రి పరిధి పడమటి కనుమలలో ఒక పశ్చిమ భాగంలోని ఉంది. జిల్లా ఉత్తరాన థానే జిల్లా, తూర్పున పూనే జిల్లాలో, దక్షిణాన రత్నగిరి జిల్లాలో, మరియు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యంగా ముంబై హార్బర్ కలిగి ఉంది. రాయ్ గఢ్ మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఒక అందమైన పర్వత కోట.ప్రాంతం చారిత్రక కట్టడాల పర్యాటకులు అనేక ఇష్టమైన హాట్ స్పాట్ నింపుతారు. ఒక ప్రముఖ పర్వతారోహణ పాయింట్ కాకుండా అది కూడా సాహసోపేత పర్యాటక కేంద్రంగా ఉంది. ఒక కొండ భూభాగం మరియు సహజ ఆకులను అలంకరించబడిన రాజ్ గడ్ ఆసం అందం పర్యాటక రంగంలో ఒక ప్రముఖ స్థానంలో పొందుతాది.ఇక్కడ ప్రశాంతత స్థలాకృతి ఖచ్చితంగా బిజీ జీవితం నుండి వచ్చే వారికి మాత్రం ఓదార్పు ఉంది.

   పర్యాటకం లో భాగంగా ప్రతి సంవత్సరం మా మిత్రుడు కోట్ల మహక్ష్మీనాయ్డు నేను అనగా మునాసల అప్పలరాజు(బాబు)మరికొంతమంది మిత్రులుతో గత ఐదారు సంవత్సరాలుగా తీర్థయాత్రలు పేరుతో జ్యోతిర్లింగాల పేరుతో పన్నేండు జ్యోతిర్లింగాలకి పదునొకటి(11)జ్యోతిర్లింగాల దివ్యదర్శనం చేసుకున్నము.దీనిలో భాగంగానే గత సంవత్సరం 2013లో...మహారాష్ట్రం పరిప్రాతంలలో గల భీమశంకరజ్యోతిర్లింగం, వైధ్యనాదేశ్వరజ్యోతిర్లింగం,త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగములను దర్శించుకున్నాము,అయితే ప్రతి సంవత్సరం వెల్తున్న మా ఇద్దరు మిత్రులం తప్పా కొత్తగా మాతో మరో ముగ్గురో నలుగురో జతకట్టి ఇప్పటివరకూ వస్తున్నారు,దీనిలోని బాగమే రాజ్ గడ్ ట్రెక్కింగ్ కు ఆవకాశం కుదిరింది, ఈ రాజ్ గడ్ ట్రెక్కింగ్ ప్రయాణలో.........
   మొదటి రోజు  ట్రెక్‌లో కావలసిన డ్రై ఫ్రూట్స్, మరిన్న బలమైన ఆహార పదార్థాలు తీసుకొని పూణే వెళ్ళాం.ఆ మరుసటి  రోజు తెల్లారుజామునే రెండు మోటర్ బైక్స్ అక్కడున్న మా మిత్రుల దగ్గర తీసుకొని  నలుగురం కలసి పూణే, బెంగళూరు హైవే దారిపట్టాం. ఓ 20 కిలోమీటర్లు ప్రయాణించాక హైవే నుండి కుడివైపుకు తిరిగి మరో 20 కిలోమీటర్లు ఖేడ్‌శివపూర్ మీదుగా  గుంజావనే అనే చిన్న గ్రామానికి చేరుకొన్నాం, అక్కడే మా బైక్స్ పార్క్ చేసాం. అక్కడ నుండే ట్రెక్ మొదలయింది. ఆ రోజు మా అద్రుస్టంకొద్ది చాలా మంది ట్రెక్కర్స్ వచ్చారు, అందులో కుటుంబాలు కూడ వున్నాయి, ఆడ,మగ అంటు తేడా లేదు..పది పదిహేనేళ్ల వయసున్న పిల్లలు కూడ వున్నారు.
     ఇక ఈ రాజ్‌గడ్ చరిత్ర గురించి చెప్పడానికి అక్కడ ఎవరూ గైడ్స్ కానరాలేదు, కాస్త అంతర్జాలంలో వెదికితే కొన్ని విషయాలు దొరికాయి. ఈ కొండలున్న ప్రాంతాన్ని దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం కనుగొన్నారు., అక్కడ  విశ్వామిత్ర మహర్షి  నివసించినట్లు  చెబుతున్నారు.  తర్వాతెప్పుడో  అనగా 1490 లో నిజాం షాహి కాలంలో అహమద్ బహిరి ఈ రాజ్‌గడ్‌ని నిర్మించి "మురంబదేవ్" అని పిలిచేవారట! ఈ కోట  దాదాపుగా వీరి పరిపాలనలో 120 ఏళ్ళ పాటు వున్నదంటున్నారు.
    తర్వాత ఎప్పుడో  చత్రపతి శివాజి తండ్రి అయిన షహాజి రాజే బొన్సాలే పరిపాలనలో మొగల్ రాజుల వలన కొన్నియుద్దాలు జరిగాయట, కోటను వదులుకోవడం, మళ్ళీ స్వాదీనం చేసుకోవడం జరిగిందని చెప్పుతున్నారు.చత్రపతి శివాజి పరిపాలన కిందకు వచ్చాక ఆయన పరిపాలనలో మూడు వైపుల వున్న కొండల మీదుగా "కర్టన్ వాల్" లాగ కోటను నిర్మించి విస్తృత  పరిచి ఈ కోటకు "రాజ్‌గడ్" అని పేరు పెట్టారట. 1672లో శివాజి రాజే తన పరిపాలన కేంద్రాన్ని రాయిగడ్ కు  మార్చుకొన్నారు. శివాజి తదనంతరం ఆయన కుమారుడైన శంబజి రాజే పరిపాలన లో  మరాఠా రాజుల పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు.  తర్వాత మళ్లీ మొఘల్  రాజులు దాడులు చేసి యుద్దాలు జరిగిన సమయంలో శంబజి రాజే  మరణించారు. దానితో  మొగల్స్ అధీనంలోకి  మొత్తం మరాఠా రాష్ట్రమంతా పూర్తిగా  చేరిపోయింది.
     మా ట్రెక్ ప్రారంభమయిన గంటకు నా అనారోగ్యం ప్రభావం కనిపించింది.! ఒక యాభై  అడుగులు వేయగానే ఆయాసంతో కాసేపు నిలబడాల్సి వచ్చింది.  అప్పుడు ఒక్క క్షణం అనిపించింది ..మొండిగా ట్రెక్కింగ్‌కు వచ్చినందుకు బాగానే తగిన శాస్తి జరిగిందన్న భాద మనసులో మదిలింది.!
      అక్కడ వాతావరణం గంటకో సారి మారుతూ వున్నది, కాసేపు మంచుతో కూడిన మేఘాలు కమ్ముకొంటున్నాయి . మళ్ళీ కాసేపటికి మాయం అవుతూ ..దోబూచులాడుతున్నాయి..! వర్షాకాలం ముగిసే  సమయంలో అక్కడ ట్రెక్ చేయడం బాగుంటుంది..బాగా ఆకుపచ్చదనంతో..భూమంతా పరుచుకొని వున్నట్లుంటుంది, కాని మా ట్రెక్ అప్పటికే..వర్షాకాలం దాటి చాన్నాళ్లు అవడం మూలాన అప్పుడప్పుడే ఆకు పచ్చదనం నుండి మెల్లగా లేత పసుపు, ఆరంజి రంగులోకి మారుతున్నది! అది కూడా ఒక రకమైన సౌందర్య భరితంగానే  కనిపించింది.
     చాలా మంది ట్రెక్కర్స్ మా లాగానే  ఆ కొండను ఎక్కుతున్నారు. మరికొందరు దిగుతూ మాకు ఎదురవుతున్నారు..వారంతా రాత్రి పైన కోటలోనే బస చేసి ఉదయమే కొండను దిగుతున్నారు. ఒక్కో చోట చాలా ఏటవాలుగా వుంటున్నది..అక్కడ మాత్రం కాస్త కష్ట పడాల్సి వస్తున్నది. ఎటు చూసినా...ఆకుపచ్చని దుప్పటి కప్పుకొన్నట్లు కనపడుతున్నది, అక్కడక్కడ ఆ ఆకుపచ్చ దుప్పటి మడతలు  పడినట్లుగా కొండ వొంపులు కనపడుతున్నాయి. దాదాపుగా రెండు గంటలు తర్వాత ఒక పెద్ద రాతి కొండ మీదున్న కోట గోడను  అతి కష్టంతో చేరుకొన్నాము. ఆ  ప్రదేశం చాలా ఏటవాలుగా వున్నది, అక్కడున్న కొన్ని ఇనుప కడ్డీల  ఆధారం తో  ఎక్కగలిగాము.అదైనా చాలా ప్రమాదంతో కూడుకున్న పనే!..కాస్త పట్టు జారినా అంతే..ఏకంగా కొన్ని వేల అడుగుల కిందకు పడిపోవడమే....!! . ఆ కోట గోడ దాటి లోపలికి వెళ్లగానే పద్మావతి కొలను కనపడుతుంది. అంత ఎత్తైన కొండ మీద చాలా పెద్ద కొలను నిర్మించారు చత్రపతి శివాజి. అది కూడా పచ్చదనం మద్యలో వున్నది. దాని చుట్టు పడిపోయిన భవనం మొండి గోడలు కనపడుతున్నయి.
    అక్కడ నుండి కాస్త పైకి వెళ్లాక అక్కడ చాలా విశాలమైన పద్మావతి దేవాలయం వున్నది. కాని అందులొ దేవాతా విగ్రహాలు కనిపించాయి.ట్రెక్కర్స్ అందరూ అందులో విశ్రాంతి తీసుకొంటున్నారు. రాత్రి అక్కడే బస చేయాలనుకొనే వారు ఆ ఆలయాన్ని వసతి గృహంగా వాడుకొంటున్నారు. ఆ దేవాలయానికి  కుడివైపున ఒక పెద్ద బావి వున్నది. ఆ నీటినే  అక్కడి వారు మంచి నీరుగా వాడుకొంటున్నారు. అక్కడ ఒక చిన్న సైజు హోటలు వున్నది. అక్కడకొచ్చే ట్రెక్కర్స్ అందరు అక్కడే భోజనాలు చేస్తుంటారు.
   అప్పటికి  సమయం పది అయ్యింది. మధ్యాహ్నానికి   మేము కూడ మా నలుగురికి భోజనాలు  ఆర్డర్ ఇచ్చి అక్కడ నుండి మళ్లీ మా ట్రెక్ మొదలు పెట్టాం, అక్కడ నుండి మూడు దారులుగా చీలిపోతుంది.  మొదటగా ఎదురుగా వున్న రాతితో నిర్మించిన తాపల మీదుగా పైకి చేరుకొన్నాం అక్కడికి, దాదాపుగా 4514 అడుగులు ఎత్తు వున్నట్లు అక్కడ సమాచారం ఉంది. అక్కడకు పెద్ద రాతి ద్వారం గుండా  చేరుకోవాలి, అక్కడే శివాజి  సేనాపతి, మంత్రులు అయిన  తానాజీ, యశాజి, షంబర్ బట్ ల నివాస గృహాలు శిధిలమై వున్నాయి. అక్కడ కూడ 15 అడుగుల వ్యాసంతో  వున్న చిన్న కొలను  వున్నది.
     అక్కడ నుండి మధ్యాహ్నం  భోజన సమయానికల్లా  కిందకు వచ్చి  మా భోజనాలు చేసాక..కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ  కుడి వైపున వున్న మరో దారి వెంట వెళ్లాం..!  అక్కడ నల్లని రాతితో నిర్మించిన కోట ముఖ ద్వారం వున్నది. అక్కడ నుండితిరిగి వెనక్కి వచ్చి..మూడో రహదారి వెంట నడిచాం.., ఈ దారిలో ఏ కాస్త ఏమరపాటున నడిచినా అంతే...  ఏకంగా ఎక్కడికో.. వేల అడుగుల కింద వున్న అడవిలోకి  జారి పడి పోవడమే!! .అంత ప్రమాద కరమైన దారే కాని..సాహసికులకు మాత్రం మంచి థ్రిల్ ఇస్తుంది.  విచిత్రమేమిటంటే ఈ కోటకు మూడువైపుల గోడ లాగ కొండలున్నాయి. వాటి మీద కోట గోడలు కట్టారు..వాటివలన కోటకు ఎటువంటి ఉపయోగం లేదు.  ఈ మూడు కొండలు ఒక చోట కలుస్తాయి అక్కడ మాత్రమే కోట వున్నది..మరెందుకు ఈ కొండల మీద కర్టన్ లాగ కోటలు కట్టారో అర్థం కాదు. అసలు అక్కడికి చేరడానికి ఎన్నో ప్రయాస కోర్చి, ఎన్నో కష్టాలు పడ్డాం..! అటువంటి చోటకు ఎలా అంతంత పెద్ద పెద్ద రాళ్లు ఎలా మోసుకెళ్లారో ఆలోచిస్తే, ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. .ఎక్కడా కూడ నడవదగ్గ రహదారి లేనేలేదు..!  ఎంతో కష్ట పడి ఎక్కాల్సిందే..పైకి. ఎంత కష్ట పడ్డారోఅనిపిస్తుంది . ఎంతమంది మనుషుల శ్రమతో ఈ కోట తయారైందో!!
       అక్కడ నుండి సాయింత్రం అవుతుండగా కిందకు దిగడం మొదలుపెట్టాం, సాయింత్రానికల్లా గుంజావనే గ్రామం చేరుకొని అక్కడి నుండి మరో రోజు ఉదయం మరో వైపు నుండి ఈ కోటను చేరడానికి కొండ ఎక్కాలని మా ఉద్దేశం, అందుకోసం చాలా వేగంగా దిగుతున్నాం.  పై నుండి వర్షపు దారలు వలన ఏర్పడిన చిన్న చిన్న కాలువలు వున్నాయి వాటికి అటు ఇటుగా మట్టి గోడలు వున్నాయి..!
  సాయంత్రానికి మరలా తిరిగి  గుంజావనే చేరుకొన్నాం. మేము బాగా అలసిపోయిఉన్నాము.మనం జీవితంలో మళ్లీ తిరిగి ఇలాంటి ట్రెక్ చేయగలమా" అన్న ఆలోచన అందరిలోని ఒకేసారి కలిగింది. ఈ ట్రెక్ గురించి వివరించడం తో చాలా సులభంగానే అనిపిస్తుంది.ఈ ట్రెక్ చాలా కష్టపడాల్సి వచ్చింది నా అనుబవం ప్రకారం ప్రమాధంతో కూడుకున్న ట్రెక్ గా బావిస్తున్నాను,
    చివరగా  తోర్నా ప్రాంతం వెల్దామన్నారు,నేను రాను అని మొండికేయడంతో విరమించుకున్నాము.తోర్నా ప్రాంతం నుండి ట్రెక్ చాలా సాహసంతో కూడుకున్నదని కొదరన్నారు, ఇక్కడ ప్రకృతి రమణీయ దృశ్యాలు చాలా వున్నాయని విన్నాను ..కొన్ని ఫోటోస్ కూడ చూసాను..అవి చూసినప్పటి నుండి ఒకటే ఉబలాటం నాలోపల..ఎలగైనా అటు వైపు నుండి ట్రెక్ చేయాలని.  మా ఫ్రెండ్స్ ముగ్గురూరు తటపటాయించారు, మనసులో చాలా దృడంగా అక్కడీకి వెళ్లాలని వున్నా... నా అభిప్రాయానికి అందరూ తలూపి.....ఇంటి ప్రయాణం సాగించాం.
    
మన భారతదేశం లో  మహారాష్ట్ర రాష్ట్ర పూనే జిల్లా కోటలలో ఒకటి రాజ్ గడ్ కోట 1318 మీటర్ల సముద్ర మట్టం. గతంలో "మురుమ్ దేవ్" అని పిలిచేవారు, ఇది మరాఠా సామ్రాజ్య రాజధానిగా  రాయ్ గఢ్ ఫోర్ట్ రాజధాని,  దాదాపు 26 సంవత్సరాలు చత్రపతి శివాజీ మహారాజ్ పాలనా కాలంలో. ఈ కొండను పటిష్టం చేసి ఉపయోగించారు. ఈ కోటను ముట్టడించడం, ఎవరితరంకాదు, ఈ. కోటలో అత్యధిక భాగం రాజభవనాలు, నీటి తొట్టెలు ఉన్నాయి. మరియు గుహల అవశేషాలు స్పస్టంగా కనిపిస్తున్నాయి.ఈ కోట శివాజీ కుమారుడు రాజారాం, శివాజీ క్వీన్ సాయిబాయి, ఆగ్రా నుండి శివాజీ తిరిగి, బల్లకిల్లా, సోనోపంత్ కఠినమైన పదాల మహాదర్వాజ్ గోడలలో అఫ్జల్ ఖాన్ తల ఖననం మరణం పుట్టిన అనేక చారిత్రక సంఘటనలున్నాయి, మా డంతో శివాజీ, మరియు ఖందోజి ఖోపాడే భాగం.ఈ కోట కూడా మొఘల్ దళాలకు నాయకత్వం చేసిన 1665 లో రాజపుత్ర రాజు జైసింగ్ తో పురందర్ సంధి (1665) కుదుర్చుకోవడం శివాజీ ఉండేందుకు 12 కోటలలో ఒకటిగా ఉంది. 22 ఇతర కోటలు ఇక్కడున్నాయి,