Tuesday, March 15, 2011

రామేశ్వరములొ విశేషాలు


రామేశ్వరము(రామనాథేశ్వర దేవాలయం)
అక్షాంశరేఖాంశాలు: 9.28, 79.3 రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది.తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.
దక్షిణభారత దేశములొ ఉన్న దేవాలయాల వలే రామేశ్వరములొ ఉన్న రామనాథేశెవరస్వామి దేవాలయ ప్రాకరము నాలుగు వైపుల పెద్ద ప్రహారి గోడలతో నిర్మితమై ఉన్నది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దురము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దురము 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. మూడవ ప్రాకారం
**********************************************************************************
బయటి ప్రాకారం తూర్పు-పశ్చిమం 690 అడుగులు
ఉత్తరం-దక్షిణం 435 అడుగులు
లోపలి ప్రాకారం తూర్పు-పశ్చిమం 649 అడుగులు
ఉత్తరం-దక్షిణం 395 అడుగులు
ఆలయం మొత్తం స్థంభాల సంఖ్య 1212
ఆలయం లోపలి భాగం ఎత్తు 22 అడుగులు 7.5 అంగుళాలు
**********************************************************************************
రామేశ్వరములొ విశేషాలు
రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడు లో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి. రామనాథస్వామి గుడి , కొటి తీర్థాలు, రామపాదాలు,ధనుష్కోడి , విభిషనాలయం, ఇంకా చాలా చాలా వున్నాయి.
చేరుకొనే విధానం
దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన ,బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్ లొ కుర్చుని సుర్యొదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగ ఉంటుంది .

No comments:

Post a Comment