Saturday, January 14, 2017

కనుమ పండగ


ఈ పండగ ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతం అయిన ఈ గోవర్ధనగిరికి మరియు గోవులకి ఈ కనుమ రోజు పూజ చేయడం జరిగింది.అప్పట్నుంచి ఇప్పటివరకు సంక్రాంతి తరువాతి రోజున కనుమ జరుపుకొంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి మరియు గోవులకు ఎడ్లకూ పూజ చేయడం జరుగుతుంది,ఇంకా ఈ రోజున పల్లెల్లో
రైతుకు వ్యవసాయంలో సహకరించే
పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున
పశువుల
పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు,
కొత్తబియ్యంతో
పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి
నైవేద్యం పెట్టిన
తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే
పొలి
చల్లటం అని అంటారు. అంటే దాని అర్థం ఆ
సంవత్సరం పాటు పండే పంటలకు చీడ-
పీడలు సోకకుండా
కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.
ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది
వారి నమ్మకం.
అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ
కలిసి కొద్దిగా
కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి
పొంగలిని
చల్లుతుంటారు. అలాగే మంచి గుమ్మడి
కాయను దిష్టి తీసి
పగులకొడతారు. కనుమనాడు ఆవులు,
ఎద్దులు, గేదెలు,
దున్నలను పసుపు, కుంకుమ, పువ్వులు,
బెలూన్లతో
అలంకరించి పూజించటం జరుగుతుంది. ఆ
రోజున వాటితో ఏ
పని చేయనీయక వాటిని పూజ్య భావంతో
చూస్తారు.
ఎందుకంటే పల్లెల్లో పశువులే గొప్పసంపద,
అవి ఆనందంగా
ఉంటే రైతుకి ఉత్సాహం, పంటల్లో వీటి పాత్ర
ఎంతో ఉంది.
వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా
కనుమను భావిస్తారు.
మరో ప్రత్యేక అంశం కొన్ని ప్రాంతాల్లో
‘కనుమ'
నాడు ‘మినుములు' తినాలనే ఆచారం. అందుకే
‘మినపగారెలు'
చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన
ఆడపిల్లలు,
అత్తింటికి వెల్ళిన అల్లుళ్ళు కూడా
కనుమ
రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ
రోజు కాకి కూడ
కదలదని సామెత. కనుమనాడు తప్పక
మాంసాహర విభిన్న
రుచులను వండుకొని తింటారు.
ఆహ్లదకరమైన వాతావరణంలో
సంతోషాలు వెళ్ళువిరిసే ‘కనుమ’
అలాగే ఈ రోజున బొమ్మల
కొలువు ఎత్తటం అని
పేరంటం చేస్తారు. బొమ్మలకు హారతి పట్టి
ఒక
బొమ్మను శాస్త్రార్థ పరంగా ఎత్తి పెడతారు.
అంతే
కాదు గొబ్బెమ్మల పూజలు, హరిదాసుల
రాకపోకలు, ఎడ్ల
పందాలు, ఎడ్లను ఊరేగించడం, కొన్ని
ప్రాంతాల్లో కోడి
పందాలు, బంతిపూలతో తోరణాలు, కొత్త
జంటల విహారాలు,
బావమరదల్ల ఇకఇకలు, పకపకలు ఎంతో
ఆహ్లదకరంగా
ఉంటాయి. ఇదే కనుమ యొక్క ప్రత్యేకత..
కనుమ పండుగ! జంతువులను పూజించే పండుగ!!
వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - #యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.
ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.
ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.
మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే #జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేద్దాం.
చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది,

No comments:

Post a Comment