Wednesday, April 12, 2017

Saturday, January 14, 2017

కనుమ పండగ


ఈ పండగ ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతం అయిన ఈ గోవర్ధనగిరికి మరియు గోవులకి ఈ కనుమ రోజు పూజ చేయడం జరిగింది.అప్పట్నుంచి ఇప్పటివరకు సంక్రాంతి తరువాతి రోజున కనుమ జరుపుకొంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి మరియు గోవులకు ఎడ్లకూ పూజ చేయడం జరుగుతుంది,ఇంకా ఈ రోజున పల్లెల్లో
రైతుకు వ్యవసాయంలో సహకరించే
పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున
పశువుల
పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు,
కొత్తబియ్యంతో
పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి
నైవేద్యం పెట్టిన
తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే
పొలి
చల్లటం అని అంటారు. అంటే దాని అర్థం ఆ
సంవత్సరం పాటు పండే పంటలకు చీడ-
పీడలు సోకకుండా
కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.
ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది
వారి నమ్మకం.
అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ
కలిసి కొద్దిగా
కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి
పొంగలిని
చల్లుతుంటారు. అలాగే మంచి గుమ్మడి
కాయను దిష్టి తీసి
పగులకొడతారు. కనుమనాడు ఆవులు,
ఎద్దులు, గేదెలు,
దున్నలను పసుపు, కుంకుమ, పువ్వులు,
బెలూన్లతో
అలంకరించి పూజించటం జరుగుతుంది. ఆ
రోజున వాటితో ఏ
పని చేయనీయక వాటిని పూజ్య భావంతో
చూస్తారు.
ఎందుకంటే పల్లెల్లో పశువులే గొప్పసంపద,
అవి ఆనందంగా
ఉంటే రైతుకి ఉత్సాహం, పంటల్లో వీటి పాత్ర
ఎంతో ఉంది.
వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా
కనుమను భావిస్తారు.
మరో ప్రత్యేక అంశం కొన్ని ప్రాంతాల్లో
‘కనుమ'
నాడు ‘మినుములు' తినాలనే ఆచారం. అందుకే
‘మినపగారెలు'
చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన
ఆడపిల్లలు,
అత్తింటికి వెల్ళిన అల్లుళ్ళు కూడా
కనుమ
రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ
రోజు కాకి కూడ
కదలదని సామెత. కనుమనాడు తప్పక
మాంసాహర విభిన్న
రుచులను వండుకొని తింటారు.
ఆహ్లదకరమైన వాతావరణంలో
సంతోషాలు వెళ్ళువిరిసే ‘కనుమ’
అలాగే ఈ రోజున బొమ్మల
కొలువు ఎత్తటం అని
పేరంటం చేస్తారు. బొమ్మలకు హారతి పట్టి
ఒక
బొమ్మను శాస్త్రార్థ పరంగా ఎత్తి పెడతారు.
అంతే
కాదు గొబ్బెమ్మల పూజలు, హరిదాసుల
రాకపోకలు, ఎడ్ల
పందాలు, ఎడ్లను ఊరేగించడం, కొన్ని
ప్రాంతాల్లో కోడి
పందాలు, బంతిపూలతో తోరణాలు, కొత్త
జంటల విహారాలు,
బావమరదల్ల ఇకఇకలు, పకపకలు ఎంతో
ఆహ్లదకరంగా
ఉంటాయి. ఇదే కనుమ యొక్క ప్రత్యేకత..
కనుమ పండుగ! జంతువులను పూజించే పండుగ!!
వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - #యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.
ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.
ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.
మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే #జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేద్దాం.
చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది,

సంక్రాంతి పండుగ ...


సంక్రాంతి అంటే మార్పు...మారడం,చేరడం అనే అర్ధాలు ఉన్నాయి.రవి సంక్రమణం రోజున స్నానం చేయ్యని నరుడు ఏడు జన్మలదాకా రోగి,నిర్ధనుడు అవుతాడు.కనుక సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి ,పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి.కొందరు నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేస్తారు.శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది.ఈ సంక్రమణకాలంలో ధాన్యం,ఫలాలు,విసనకర్ర , వస్త్రం, గుమ్మడి, సువర్ణం, కాయగూరలు, దుంపలు,తిలలు,చెఱకు,గోవు మొదలైనవి దానం చేయాలి.ఈ రోజున వస్త్రదానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

దేవఋణం, పితృఋణం,మనుష్యఋణం,ఋషిఋణం, భూతఋణం అనే పంచ ఋణాల నుంచి విముక్తిని పొందే మార్గాలను ప్రతి గృహస్థుడు ఏ విధంగా ఆచరించాలో ఒక ఆచారాన్ని నిర్దేశించింది ఈ మకర సంక్రాంతి.










దేవఋణం
ఇంద్ర,వరుణ,వాయు దేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించుట వల్లనే మకర సంక్రాంతి పండగ నాటికి పంటలు సమృద్ధిగా పండి,రైతు చేతికి అందుతాయి.తద్వారా మనిషి జీవన పోషణ జరుగుతుంది.అందుకే సంక్రాంతి నాడు తలంటు స్నానం చేసి,సూర్యాది దేవతలను పూజించి,కొత్త బియ్యంతో పొంగలి,పులగం తయారుచేసి పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించడం మన ఆచారం.

పితృఋణం
పితృ తర్పణాలు ,పిండోదక దానాలు,శ్రాద్ధకర్మలు మొదలగునవి ఆచరించడం ద్వారా , మరణించిన పితృల ఋణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు.మకర సంక్రాంతినాడు తెలక పిండి(నువ్వులపిండి) ఒంటికి రాసుకుని స్నానం చేయడం ఒక ఆచారం.ఎందుకంటే మకర రాశికి శని అధిపతి.శని వాత ప్రథాన గ్రహమంటారు.వాతం తగ్గాలంటే ఈరోజు తెలకపిండితో స్నానం చేసి,నువ్వులు,బెల్లం,గుమ్మడికాయ మొదలైనవి దానాలు ఇవ్వడమే దీనికి పరిహారం.కాబట్టే నువ్వులు, బియ్యంపిండి, బెల్లంతో చేసిన అరిసెలను అంతా కూడా తింటుంటారు.

భూతఋణం
నీరు,భూమి,గాలి,ఆకాశం,అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి.అందుకే కృతజ్ఞతతో పంచభూతాలను కూడా పూజిస్తాం.పండిన పొలాల్లో పొంగలి మెతుకులు ,పసుపుకుంకాలు చల్లి ఎర్ర గుమ్మడి కాయను పగులకొట్టి దిష్ఠి తీయడం ఆచారమైంది.పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి.ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి.కాబట్టే కృతజ్ఞాతాసూచకంగా 'కనుమ' నాడు పశువులను, పశుశాలను శుభ్రం చేసి అలంకరిస్తారు.వాటికి కూడా పొంగళ్ళు తినిపిస్తారు.ఇళ్ళ ముంగిట బియ్యం పిండితో రంగవల్లులు వేస్తారు.ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహరం.ఇలా మూగ జీవులకు ,భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాన్ని ఈ పండుగ నిర్దేశించింది.

మనుష్యఋణం
ఇతరుల సహాయసహకారాలు లేనిదే సమాజంలో జీవనం సాగించలేం.అందుకు కృతజ్ఞతగా ఈ పండుగనాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరుకు, గోవులు, ఫలాలు, వస్త్రాలు, బంగారం వంటివి విరివిగా దానధర్మాలు చేస్తారు.అతిథులను ఆదరిస్తారు.వ్యవసాయంలో సహాయం చేసినవారికీ, గ్రామంలోని ఇతర వృత్తులవారికీ
కొత్త ధాన్యాన్ని పంచి పెట్టడం కూడా సంక్రాంతిలో మరొక ఆచారం.

ఋషిఋణం
సంక్రాంతి సాధనలు, సత్ గ్రంధ పఠనాదులూ శిఘ్రఫలాలనిస్తాయని విశ్వసిస్తారు.వీటిని ఆచరించడం ద్వారా ఋషిఋణం తీరుతుందని భావిస్తారు.

భోగి పండుగ


సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ చాలా సందడితో అందరిలో ఆనందాన్నినింపుతుంది.
అలికిన వాకిళ్ళలో అందమైన రంగువల్లులు, ముచట గొలిపే గొబ్బమ్మలు, గొబ్బెమ్మలలో అమరిచిన అందమైన పూల ముగ్గుల మధ్య ముచ్చటైన అడుగులు వేసే హరిదాసులు, హరిదాసుల చెక్క భజనతో వినిపించే భక్తి గీతాలు. డుడు బసవన్నల ఊరేగింపు ఉత్సవాలు భోగి మంటలు, పొంగలి వంటలు, చేమ్మచేక్కలాటలు ఉత్సాహం ఉత్సాహం అంతటా పండుగ ఉత్సాహం. ఈ సంప్రదాయం వెనుక దాగివున్న సంస్కృతిని ఒక్కసారి పరిశీలిస్తే











ముగ్గులు - శుచి, శుభ్రతకు సంకేతాలు - వాకిట్లో ముగ్గు పెట్టకుండా భర్త బయటకు వెళ్ళకూడదు అనేమాట అనాదిగా వింటున్నాం. దీనివెనుక అంతరాద్దన్ని గమనిస్తే భర్త బయటకు బయలుదేరటానికిముందే ఉదయాన మేల్కొని వాకిలి వూడిచి ముగ్గు పెట్టాలి. ఇది యిల్లాలిలో కలిగించి భాద్యతను తెలిపెమేలుకోలుపు. వాకిలి చిమ్మటం అంటే బద్ధకం వదిలి పొద్దున్న లేవాలి. చల్లని నీళ్ళతో వాకిలిని కడిగితే కొంత బద్ధకం పోతుంది. ముగ్గు వేయటానికి కొంత మేదస్సు కావాలి. చుక్కలు లెక్కలు వేసి ముగ్గు వేయటంతో పూర్తి బద్ధకం దూరమై దినచార్యకి అవసరమైన పూర్తి చతన్యం కలుగుతుంది. వివాహానంతరం గృహినికి ముగ్గు వేస్తూ తదుపరి తన పుత్రికకు కబోయే గృహినికి ముగ్గు సంప్రదాయం ద్వారా చితన్యం అందించటం జరిగుతుంది. నేడు ఈ ముగ్గు సంప్రదాయం విడిచిన ప్రాంతాల్లో స్త్రీలు కూడా బారెడు పొద్దు ఎక్కాక నిద్ర లేస్తున్నారు - కుసంస్కరాలకు బానిసలవితున్నారు.
గొబ్బెమ్మలు: ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయటం మన సంప్రదాయం. ఆవు పేడ రోగ నిరోధకం, చలి కలం వచ్చే కాళ్ళకలక, ఆటలమ్మ, తడపరలాంటి వ్యాదులు గుమ్మం దాటి లోపలికి రాకుండా ప్రతి గుమ్మంలోను గొబ్బెమ్మలు నిరోదిస్తాయి.










హరిదాసులు: ఉదయాన్నే భక్తి గీతాల ద్వారా నీతిని భోదిస్తూ చెక్క భజనలతో అందరిలో బద్ధకం పోగొడుతూ చితన్యవీచికలు అంతటానెలకొల్పి అందరిలో స్నేహభావాన్ని పెంచటం హరిదాసుల సంప్రదాయం.
బసవన్నల ఊరెగింపు: బసవన్నలకు దండం పేడటం వల్ల పశుసంరక్షణ కర్తవ్యం అందరికి భోదపడుతుంది. పశుసంరక్షణ తెలుసుకొని మాంసబక్షణ చేయరు.
భోగిమంటలు: భోగిమంటల వల్ల చెడు అని చెప్పబడే చలిని దూరంచేస్తారు. మనిషిలోని చెడుని కాల్చి మంచిని నింపాలి, అందుకు ముందుగా అంతటా వున్న చెడు భోగి మంటల్లో కాల్చివేయాలి.
పొంగలి: ఆవుపాలు శ్రేష్టమైన బెల్లంతో కొత్త బియ్యంతో, మట్టి కుండలో చేసి స్వీకరించటం ద్వారా చక్కటి ఆరోగ్యం అందరికి కలుగుతుంది. సంప్రదాయం వెనుక ఆనందమేకకుండా ఆరోగ్యం కూడావుంటుంది. ఇదియేమన సంస్కృతి విసిహ్టత.