Saturday, December 6, 2014

మన దీపావళి,2014

మన దీపావళి,

జి వి ఎమ్ సి 56వ వార్డ్ పరిథి ఫార్మాసిటీ కాలనీలో.....జరుపుకుంటున్న దీపావళి ద్రుశ్యాలు...!!!
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు,ఈ దివ్య దీపావళి సోయగాలు.అయితే ఈ సంవత్స్రరం హుద్ హుద్ తుపాను ప్రబావంవలన విశాఖ జిల్లాలో బారీగా నస్టం వాటిల్లడంతో పాటు ఎక్కడ చెట్ట్లు అక్కడే పడి ఉండడంతో అగ్నిప్రమాథాలు జరగ కుండా ప్రభుత్వం  బాణసంచా చప్పుళ్ళు,లేకుండా చరతలు విదించింది,అయితే  ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంట ఆ లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.అలాగే చెరకు మోసులకు కొందరు,గోంగూరకాడలకు ఆముదం మొక్కలకు మరికొందరూ ఇలా వత్తులు కట్టి దేవుని గదిలో పూజించి అక్కడ వున్న ప్రమిద దీపానికి వెలిగించి వీదులలో నిలబడి వెలుగిస్తుంటారు,ఆ వత్తులు గణమైన తరువాత ఆ కర్రలను నేలపై మూడు సార్లు కొట్టి అమావాస్య వెల్లిన మూడు రోజుల తరువాత నాగులచవితి అని నినాదాలు చెప్పితారు,
 ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజించాలని పురోహితులు అంటున్నారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా  పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు.
లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలను పొందండి.
ఆ తరువాత చెరుకుమోసులకు వత్తులు కట్టి వెలిగిస్తారు కొందరు...ఆయుథం కర్రలకు మరి కొందరు గోంగూర కాడలకు వత్తులు కట్టి వెలిగిస్తారు,అదే సమయంలో టపాసులు పేల్చుకుంటారు ,మందుగుండు సామాగ్రితో ఇల్లూదిపారి అందరూ సంతోసంగా గడుపుతారు,





No comments:

Post a Comment