Friday, July 27, 2012

వరలక్ష్మీ నమోస్తుతే




వరలక్ష్మీ నమోస్తుతే...

"లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం1 శ్రీ రంగథామేశ్వరీం

దాసీభూత సమస్త దేవ వనితాం1 లోకైక దీపాంకురాం1

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః 1 బ్రహ్మేంద్ర గంగాధం 1

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" 2

అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి (ఐదుగంటలకు), అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.

తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి.

ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.

ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ (వీలైతే వెండిది)ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం సుకోవాలి. పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి.

ఇకపోతే.. సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, "ఓం మహాలక్ష్మీదేవ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి.

పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి.

వరలక్ష్మీ వ్రత పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది.

శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్య దినాన్ని విశేషంగా జరుపుకుందాం..


"సుమనస వందిత, సుందరి, మాధవి చంద్రసహోదరి హేమమయే

మునిగణ మండిత, మోక్షప్రదాయని మంజుల భాషిణి, వేదనుతే

పంకజవాసిని, దేవసుపూజిత సద్గుణ వర్షిణి, శాంతియుతే,

జయ, జయ, హేమధుసూదన కామిని ఆదిలక్ష్మీ జయపాలయమాం" 2

అంటూ పై మంత్రముతో ఆ ఆదిలక్ష్మిని ధ్యానము చేసుకుని, వరలక్ష్మీ వ్రత మహాత్మ్యంను తెలుసుకుందాం. ఒకసారి కైలాస పర్వతమందు వజ్రవైఢూర్యాది మణులతో పొదగబడిన సింహాసనముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్న సమయాన.. "పార్వతి" ఓ ప్రాణనాధా! లోకమున స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సర్వసౌభాగ్యంబులును, పుత్రపౌత్రాదులతో సుఖంబుగా నుందురో అట్టి వ్రతాన్ని గురించి వివరించాల్సిందిగా ప్రార్థిస్తుంది.

ప్రజాహితము కోరి నీవడిగిన సంశయమును తీర్చెదనంటూ పరమేశ్వరుడు "శ్రీ వరలక్ష్మీ" వ్రతమును గురించి ఈ క్రింది విధముగా చెప్పుకొచ్చాడు. శ్రావణమాసమున శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే "శుక్రవారం" నాడు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే.. సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయని పరమేశ్వరుడు పేర్కొన్నాడు.

పూర్వము మగధదేశమున "కుండినంబు" అనే పట్టణము ఉండేది. ఆ పట్టణమంతయు బంగారు ప్రాకారములతో నిర్మించబడి ఉంటుంది. ఆ పట్టణములో నారీ శిరోమణి అయిన "చారుమతి" అను మహా పత్రివ్రతయైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ప్రతినిత్యం గృహస్థు ధర్మాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ భర్తను, అత్తమామలను సేవిస్తూ ఉండేది.

అంతేగాకుండా.. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. అట్టి పతివ్రతా శిరోమణిపై "శ్రీ వరలక్ష్మి" అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమందు చారుమతికి ప్రత్యక్షమై శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని దేవదేవి అభయమిస్తుంది.

ఈ స్వప్న వృత్తాంతమును ముందు భర్తకు, ఆపై అత్తమామలకు, ఇరుగు పొరుగు వారలకు ఎంతో సంతోషంగా చెబుతుంది. నాటి నుండి స్త్రీలందరూ వరలక్ష్మీదేవి చెప్పిన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగానే ఆ పుణ్యదినం రానే వచ్చింది.

ఆ రోజు "చారుమతి" ఇరుగు పొరుగు స్త్రీలతో కలిసి వారి వారి ఇళ్లను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో అలంకరించుకుని, ఒక బ్రాహ్మణోత్తముని ఆహ్వానించి షోడశోపచారముతో ఆ "వరలక్ష్మీ" దేవిని చారుమతితో గూడి పూజించి వివిధ భక్ష్య భోజ్యములను ఆ తల్లికి నివేదన చేసి, ఆ తల్లికి వారంతా ప్రదక్షణ చేయగానే.. కాలి అందియెలు ఘల్లు ఘల్లుమనే శబ్దముతో లక్ష్మీదేవి వారి వారి గృహములందు ప్రవేశించింది.

ఇలా వరలక్ష్మీ దేవి అనుగ్రహంతో చారుమతితో పాటు పూజ చేసిన స్త్రీలందరూ సిరిసంపదలతో, పుత్రపౌత్రాదులతో సుఖంగా జీవించారని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించినట్లు స్కాందపురాణంలో కలదు.

ఇంకా.. ఈ వరలక్ష్మీ వ్రతమును అందరూ ఆచరించవచ్చునని, అట్లు వరలక్ష్మీ వ్రతమాచరించిన స్త్రీలకు అయిదోతనము, సౌభాగ్యం, సంతానప్రాప్తి వంటి సర్వశుభములు కలుగుతాయని ముక్కంటి, గిరిజకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే"

తాత్పర్యం: మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం.

భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. ఆమెను పై మంత్రముతో వరలక్ష్మి వ్రతమునాడు స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.

అష్టలక్ష్మి దేవీలలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందని పురోహితులు అంటున్నారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని వారు చెబుతున్నారు.

సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు.

లక్ష్మిదేవిని కొలిచే పద్ధతులు చాలా ఉన్నా.. వరలక్ష్మిదేవి పూజ జగదానందకరమైందని భక్తుల విశ్వాసం. అందుచేత సకల శుభకరమైన, మంగళదాయకమైన వరలక్ష్మి పూజను పాటించే వారికి సర్వమంగళములు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Thursday, June 7, 2012

"అరకు" అనుభవాలు



కాశం నుంచి ధారగా కురుస్తున్న పొగమంచు. ఆ మంచులో మత్తుగా పడుకున్న కొండచిలువ లాంటి రైల్వే ట్రాక్. దారి పొడవునా ఆకాశాన్నంటినట్టుగా వుండే సిల్వర్ వోక్ చెట్లు. వాటి పక్కనే గాలికి స్లో మోషన్‍లో ఊగుతున్నట్టుగా దేవదారు కొమ్మలు. రోడ్డుకు ఇరువైపులా పచ్చటి తివాచీ పరచినట్టుగా వున్న పచ్చిక బయలు. దాని మీద అందంగా ట్రిమ్ చేసిన పొదలు. వాటి మధ్యలో అప్పుడే తలారా స్నానం చేసినట్టుగా ఉన్న క్రిస్మస్ చెట్లు. దూరంగా కొండల్లోంచి కోకిల గొంతుకు తీతువుపిట్ట స్వరం తోడయి ఎకో ఎఫెక్ట్ లో వినిపిస్తున్న 


వింత శబ్దాలు.యూకలిప్టస్ ఆకుల చిలిపి సయ్యాటలు. వాటి నుంచి వచ్చే సౌగంధానికి గమ్మత్తుగా మూసుకుపోతున్న కనురెప్పలు. దూరంగా తేయాకు తోటలనుంచి ఘుమఘుమల్ని మోసుకురావడానికి ప్రయాస పడుతున్న పిల్లతెమ్మెరలు. అక్కడక్కడా


బొమ్మరిల్లుల్లాంటి విడిదిగృహాలు.దారిపొడవునా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే మట్టిప్రతిమలు...దేవుళ్ళ విగ్రహాలు. గలగలమంటూ దూకే అందమైన జలపాతాలు. ఇవీ మంచు ముసుగును కప్పుకొని తొంగిచూస్తున్న అరవిరిసిన అరకులోయ అందచందాలు. ఇక్కడికెళ్ళిన ప్రకృతి ఆరాధకుడు మరపురాని అనుభూతులని గుండెనిండా నింపుకొని వెళ్తాడు.
అరకు వెళితే మనసు మరోలోకంలో తేలిపోతుంది. అన్నీ మరచిపోయి హాయిగా అక్కడే ఉండిపోతే ఎంతబాగుండు అనిపిస్తుంది. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటుచూసిన హరితవర్ణమే. ఆహ్లాదకరమైన వాతావరణమే. ఎత్తైన కొండలు అంబరాల అంచును చూద్దామంటాయి. గంభీరమైన లోయలు తమ లోతు కనుక్కోమంటాయి. అడుగడుగునా కొండవాగుల పలకరింతలు..కొండకోనలనే నెలవుగా మలచుకున్న గిరిజనం.. చెట్టుపుట్టలనే నమ్ముకున్న వారి జీవనాధారం.. అరకు అంటే మట్టిమనుషుల పచ్చని వాటిక. అరకు అంటే పర్యాటకుల ఆహ్లాద పేటిక. అడవితల్లికి దండాలు అనిపించే అపురూపమైన స్ధలం.


నేను అరకు సీనరీలను సినిమాల్లోనే చూడ్డం.. లేకపోతే అబ్బో అరకు అందాలు అని కళ్ళింత చేసుకొని చూసొచ్చినవాళ్ళు చెబితే చెవులింత చేసుకొని విన్నాను.ఇక ఆగలేను మొర్రో అని అరకులోయ అందాలను చూసొద్దామని బయల్దేరాం మేం ఐదుగురు మిత్రులం..



విశాఖ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయలు రైలుమార్గంలో వెళ్ళాలంటే కిరండూల్ కొత్తవలస ట్రైన్ ఎక్కాలి. ఈ సెక్షన్లో నడిచే ఏకైక ప్రయాణీకుల రైలు అదే. ఇది రోజూ ఉదయం ఆరున్నరకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. శృంగవరపు కోటదాకా మైదాన ప్రాంతం.. అక్కడ్నుంచి ఘాటీ సెక్షన్ మొదలవుతుంది.



మన ధ్రిల్ మొదలయ్యేది కూడా ఇక్కడ్నుంచే. నిజానికి ఈ రైలు మార్గం వేసింది బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ రేవుకు తరలించేందుకు. దీనిమీదే కిరండూల్ రైలు ప్రవేశపెట్టారు. ఈస్ట్ కోస్ట్ సెక్షన్ పై ఈ రైలు కొత్తవలస దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని అరకు మార్గం పడుతుంది.అంతిమగమ్యం కిరండూల్. అందుకే దీనికి కొత్తవలస-కిరండూల్ రైలు.. లేదా షార్ట్ గా కెకె రైలు అని పేరు వచ్చింది. కొత్తవలస నుంచి బయల్దేరి రెండు స్టేషన్లు దాటాక శివలింగపురం అనే ఊరు వస్తుంది.


ఇక్కడ్నుండే రైలు కొండలెక్కడం మొదలవుతుంది. గోస్తని నది లోయ . దని చుట్టూ రక్షణ కడ్యంలా నిల్చున్న కొండలు..ఆ కొండల మీదుగా రైలు ప్రయాణం. ఎక్కడ చూస్తే అక్కడ పచ్చదనం. దారిపొడవునా స్వాగత తోరణాల్లాంటి కొండవాగులు, జలపాతాలు, రైలుకు ఎడమవైపుగా, లోయలు కుడివైపుగా వస్తాయి. రైలు ఎత్తుకు చేరుకున్నాక 


అసలు మజా ఉంటుంది.కిందకు చూస్తే అగాధంలాంటి లోయలు. పైకి చూస్తే భీకరమైన కొండలు. కొండల ఎత్తు సముద్ర మట్టానికి ఆరువందల నుంచి తొమ్మిది వందల మీటర్ల దాకా ఉంటుంది. ఈస్ట్రన్ ఘాట్స్ లో ఈ కొండలు ఓ భాగం. రైలు పాములా జరజరా పాకుతూ కొండలను చుట్టేస్తుంటే అటు ప్రకృతి.. ఇటు మానవ మేధస్సూ రెండూ అబ్బురపరుస్తాయి. దారిలో ఎనభై నాలుగు వంతెనలు, యాభై ఎనిమిది టన్నెల్స్. గాలిలో తేలుతున్నట్టుండే 



వంతెనలు, కొండలను తొలిచి నిర్మించిన టనెల్స్..వీటి గుండా ప్రయాణం.అరకు వెళ్ళే దారిలో అతిపెద్ద టనెల్ పొడవు అరకిలోమీటర్ పైనే. వంతెన తర్వాత టనెల్.. టనెల్ తర్వాత వంతెన అన్నట్టు సాగుతుంది ప్రయాణం. మధ్యలో కొండల మీదుగా దూకే ఏర్ల నుంచి తుంపరలు వంటిమీద పన్నీరులా పడి గిలిగింతలు 






పెడుతుంటాయి. దారిలో గిరిజన గ్రామాలు. కొన్ని దగ్గరగా..కొన్ని అల్లంతదూరంలో. చుట్టూ అడివి.రైలు శబ్ధం తప్ప మరో శబ్ధం వినపడదు. కళ్ళముందు పరచుకున్న పచ్చదనం. అక్కడక్కడా చిన్న వాగులు. వీటిని స్ధానికులు గెడ్డలని పిలుస్తారు. ఇలాంటివి ఎన్నున్నాయో లెక్కపెట్టడం సాధ్యంకాదు . మధ్యలో బొర్రాగుహల స్టేషన్ వస్తుంది. తర్వాత వచ్చేది సిమిలిగూడ.ఈ సెక్షన్ లో ఎత్తయిన స్టేషన్ ఇదే. రైలు మ్యాగ్జిమం ఎత్తుకు 
చేరుకునేది ఇక్కడే. తర్వాత వచ్చేది అరకు.. ద ఫైనల్ డెస్టినేషన్...