Monday, June 29, 2015

యాత్రా అనుబవం రుక్మిణీదేవి మందిరం

                                                     యాత్రా అనుబవం రుక్మిణీదేవి మందిరం



బెట్ ద్వారక చూడడానికి  బస్సులో బయలుదేరాం. మార్గమద్యంలో రుక్మిణి మందిరం చూసాము.  రుక్మిణి మందిరంలో కుడ్య శిల్పంగా  కృష్ణుడు , రుక్మిణీదేవి దుర్వాసుడి రధం లాగుతున్న దృశ్యం చెక్కబడి ఉంది. 
మాతో వచ్చిన గైడు ఇక్కడకు చుట్టుపక్కల 5  కిలో మీటర్ల  దూరం  వరకు మంచి నిరు లభించదని అది దుర్వాసుడు రుక్మిణి దేవికి ఇచ్చిన శాపమని వివరించాడు. రుక్మిణీదేవి దుర్వాసుడి ఆదేశం మీరీ దాహార్తి తీర్చుకోవడానికి కొంత జలం సేవించిన కారణంగా ఇటువంటి శాపానికి గురి అయిందని. కానీ ఇక్కడ ఉన్న ఒక బావిలో మాత్రమే మంచి నీరు దొరికేలా శాపవిమోచనం చెప్పాడని తెలుసుకున్నాము.
 రుక్మిణిదేవిని దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చాము. వెలుపల స్త్రీపురుషులు ఆనందంగా నృత్యం  చేయడం చూసి ఆనందించాం. మేము కూడా నృత్యంలో పాల్గొని ఆనందించాం
 ఆలయం దర్శించి నృత్యాలు చూసిన ఆనందంతో వెలుపలికి వచ్చి ఆలయానికి ఎదురుగా కొంత దూరంగా   కూర్చున్న బిక్షువులని చూసాం. వారు చక్కని శుభ్రమైన దుస్తులు ధరించి క్రమ శిక్షణగా కూర్చున్నారు వారిని భిక్షువులు అంటే నమ్మబుద్ధి కాలేదు. వేషధారణ అలా ఉంది మరి. గైడు వారి గురించి ఇలా చెప్పాడు. ఆలయ నిర్వాహకులు వారిని ఇలా కూర్చోమని చెప్పారని భక్తులు తమంతట తాము ఏదైనా ఇస్తే మాత్రమే పుచ్చుకుంటారని. ఏది ఇచ్చినా సమానంగా పంచుకుంటారని చెప్పారు.  మాలో కొందరు వారికి కొంత ధన దానం చేసారు. వారి క్రమ శిక్షణ చూస్తే ముచ్చట  వేసింది.ఆ తరువాత మా ప్రయాణం కొనసాగించి బెట్ ద్వారక చేరుకున్నాము.
 మరుసటి రోజు ఉదయానికి  గోమతీ ద్వారక  చేరుకున్నాము. ఇక్కడ గోమతి నది సముద్రంలో సంగమిస్తుంది. గోమతి ద్వారకలో కృష్ణుడు రాజ్యకార్యకలాపాలు నిర్వహించిన ప్రదేశం. ఇక్కడ కృష్ణుడి మనుమడైన వజ్రనాభుడు ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.  10వ దశాబ్దంలో ఈ ఆలయ పునర్న్ర్మానం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 
స్నానాదికాలు చేసి  ఆలయ దర్సనానికి బయలుదేరం.అక్కడ గోకుల్ హోటల్ నుండి అటోలలో  ఆలయానికి వెళ్ళాం. ఆలయంలో కెమెరా సెల్ ఫోన్లను అనుమతించరు కనుక చాయాచిత్రాలు తీసే అవకాశం లేదుమరి.  లోపలకు వెళ్లి కృష్ణుడి చిత్రాన్ని కొనుక్కుని ఆలయ దర్శనం చేసుకోవడానికి  వెళ్ళాం.  ఆలయ ప్రదిక్షణ  చేసి స్వామి సన్నిధిలో క్యూలో నిలబడి  దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దర్శనం చేయడానికి వత్తిడి లేదు కనుక సులువుగా దర్సనం అయింది. 
ఈ ఆలయానికి  గోపురం మీద జండా ఒక రోజుకు ఐదు సార్లు ఎగుర వేస్తారు. భక్తులు ఈ జండా ఎగురవేయడానికి అనుమతి తీసుకుని జండా సమర్పిస్తారు. సమర్పించే భక్తులను కూడా పై వరకు  తీసుకు వెళ్లి ఆక్కడ పూజ చేయించి ఆలయ కార్యకర్తలు జండా ఎగురవేస్తారు. ఈ జండాను భక్తులు  అత్యంత శ్రద్ధతో తాకి నమస్కరిస్తారు.  ఈ జండా ఎగురవేయడానికి కొన్ని సంవత్సరాల ముందే నమోదు చేసుకుంటారు కనుక ఈ అవకాశం లభించడం అపురూపంగా భావిస్తారు. ఇలా ద్వారకలో కృష్ణుడి జండా ఇప్పటికీ ఇలా నిరంతరంగా  ఎగురుతూనే ఉంది.  ఇలా దర్శనం  చేసుకుని వెలుపలికి వచ్చి అలా కూర్చున్నాము. అప్పుడు అక్కడ ఆలయం చూపడానికి గైడ్ వచ్చాడు. గైడ్ వెంట పోయి తిరిగి ఆలయం అంతా తిరిగి వివరంగా చూసాము. 
ఇక్కడ కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడికి తనకుమారుడైన అనిరుద్ధిడితో ప్రత్యేక ఆలయం ఉంది. బలరాముడికి,  రేవతికి, దేవకీ, వసుదేవులకు, వాసుదేవుడికి, రుక్మిణి, సత్యభామ, జాంబవతికి, సుభాద్రలకు  విడి విడిగా సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయములో దర్శనం  అయిన తరువాత స్త్రీలు  గుంపులు గుంపులుగా కూర్చుని ఆలయ ఆవరణలో కూర్చుని కృష్ణుడి  చిత్రం ముందు పెట్టుకుని కృష్ణుడి గీతాలు పాడుకుని వెలుతూ ఉంటారు. 
ఇది చూడడానికి వినడానికి కూడా ఆసక్తిగా ఉంది. ఆలయం నుండి వెలుపలికి రాగానే పక్కనే గోమతి నది సాగరసంగమం చేసే ప్రదేశం చేరుకున్నాము. అక్కడ మరి కొన్ని ప్రదేశాలు చూసి తిరుగు ముఖం పట్టాము. సాయంత్రానికి తిరిగి సమీపంలో రుక్మిణి ఆలయం , శివుడి గుడి  అలాగే అక్కడే ఉన్న చిన్న చిన్న ఆలయాలను చూసాము.  తిరిగి రాగానే మళ్లీ కృష్ణుడి దర్శనానికి వెళ్ళాము. ఇలా మా యాత్ర ముగిసింది.

క్రీ"శే..పాలవలసవరహాలమ్మ28వ వర్థంతి....

క్రీ"శే..పాలవలసవరహాలమ్మ28వ వర్థంతి....